Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసులోని నిందితులు చనిపోయారు.. సో.. కేసు క్లోజ్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:18 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నలుగురు నిందితులు చనిపోయారనీ, అందువల్ల దిశ కేసును క్లోజు చేయాలని కోర్టును షాద్ నగర్ పోలీసులు కోరనున్నారు. ఇందుకోసం షాద్‌నగర్‌ కోర్టులో రిపోర్టు దాఖలు చేసి కేసు క్లోజ్‌ చేసేందుకు అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
 
ఈ కేసులో నలుగురు నిందితులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తు చేసే వీలులేనందున కేసు క్లోజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తునకు ఆస్కారం లేని పలు కేసుల్ని గతంలో పోలీసులు కోర్టు అనుమతితో క్లోజ్‌ చేశారు. దీంతో ప్రస్తుత కేసులోనూ అదే తరహాలో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. 
 
అదేసమయంలో షాద్‌నగర్‌ పీఎస్‌లో దిశ మిస్సింగ్‌, కిడ్నాప్‌, హత్యాచారానికి సంబంధించి నమోదైన కేసు క్లోజ్‌ అయినా... నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన విచారణ వాస్తవాలు నిగ్గుతేలే వరకు కొనసాగనుంది. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ ఈ వారంలో హైదరాబాద్‌కు వచ్చి విచారణ ప్రారంభించనుంది. 
 
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు నిందితులు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయిన విషయం తెల్సిందే. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో కోర్టులో రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments