Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో వజ్రాల వర్షం

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (13:16 IST)
మే చివరిలో ప్రారంభమయ్యే తొలకరి జల్లులతో కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, ఎర్రగుడి, మదనంతపురం, పగిడిరాయి, మద్దికెర మండలం పెరవలి పొలాల్లో వజ్రాన్వేషణ ప్రారంభమవుతుంది. జూన్‌, జూలై వరకు ఇది కొనసాగుతుంది.

జొన్నగిరి నుంచి పెరవలి వరకు ఎస్‌ ఆకారంలో భూగర్భంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. భూ ఉపరితలానికి చాలా లోతులో ఈ నిక్షేపాలు ఉండడంతో వాటిని తవ్వి తీయడం కష్టమని భావించారు. భూమి పొరల్లో మార్పులు చోటు చేసుకునే సమయంలో నిక్షేపాల్లో ఉన్న కొన్ని వజ్రాలు భూమి ఉపరితలానికి చేరుకుంటున్నాయి. తొలకరి జల్లులు కురిసిన సమయంలో వాటి ఉనికి బయట పడుతోంది. 
 
వ్యాపారుల మాయజాలం
అదృష్టం వరించి వజ్రం దొరికినా, స్థానిక వ్యాపారుల చేతుల్లో వారు మోసపోతున్నారు. వజ్రాన్వేషణ ప్రాంతంలో వ్యాపారులు తమ అనుచరులను నియమించుకుంటారు. ఎవరికైనా వజ్రం దొరికితే వెంటనే వ్యాపారులకు తెలియజేస్తారు. వారిని వ్యాపారుల వద్దకు తీసుకువెళతారు.

తమకు లభించిన వజ్రం విలువ ఎంతో, బహిరంగ మార్కెట్‌లో ఎలా అమ్ముకోవాలో తెలియక వజ్రం దొరికిన వారు వ్యాపారులు చెప్పిన ధరకు వజ్రాన్ని అమ్ముతున్నారు. వజ్రం విలువలో పావలా భాగం కూడా వ్యాపారులు చెల్లించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 
 
ఏటా కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఇక్కడి పంట పొలాల్లో లభిస్తుండడంతో వజ్రాల అన్వేషణ కోసం గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా అన్వేషకులు వస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సమీప ఆలయాలు, పాఠశాలల భవనాల వద్ద వారం పది రోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని వజ్రాల అన్వేషణ సాగిస్తుంటారు. వజ్రం దొరికితే బిడ్డలను బాగా చదివించాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అన్వేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments