Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని ఉమ అరెస్టుతో ఆగ‌ని నిజ‌నిర్ధార‌ణ‌, సౌమ్య అరెస్ట్

Webdunia
శనివారం, 31 జులై 2021 (11:52 IST)
కొండ‌ప‌ల్లి రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తూ, నిజ నిర్ధార‌ణ‌కు వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ ఉదంతం ఇంకా చ‌ల్లార‌లేదు... ఇపుడు మ‌ళ్ళీ ఇంకో నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ కొండ‌ప‌ల్లికి బ‌య‌లుదేరింది.

అదీ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వ‌ర్యంలో...నందిగామ నుంచి కొండపల్లిలో జరిగిన అక్రమ మైనింగ్ పరిశీలనకు తెలుగుదేశం పార్టీ నిజ నిర్థారణ కమిటీ బ‌య‌లుదేరింది. దీనితో వారు కొండపల్లి వెళ్లకుండానే, నిజ నిర్థారణ కమిటీ సభ్యురాలు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని పోలీసులు ముందస్తుగా నందిగామలోనే హౌస్ అరెస్ట్ చేశారు.

ఆమెతోపాటు నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాలలోని ప్రధాన నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమ‌ కొండ‌ప‌ల్లి ఫారెస్ట్ నిజ‌నిర్ధార‌ణ‌కు వెళ్ల‌డంతోనే, శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని...అందుకే, ఇపుడు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొండ‌ప‌ల్లి ప‌ర్య‌ట‌నను అడ్డుకున్నామ‌ని పోలీసులు చెపుతున్నారు.

గ‌త మూడు రోజుల క్రితం అరెస్ట‌యిన దేవినేని ఉమ ఇంకా రాజ‌మండ్రి జైలులోనే ఉన్నారు. ఆయ‌న‌కు బెయిల్ తేవాల‌ని తెలుగుదేశం నాయ‌క‌ులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, పోలీసులు మాత్రం ఉమ‌ను త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు. దీనితో కొండ‌ప‌ల్లి రిజ‌ర్వ ఫారెస్ట్ క్వారీయింగ్ ఇపుడు పోలీసుల‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments