Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం జగన్... కొత్త చట్టంతో పిచ్చెక్కుతోందా...? : మంత్రి ఉమామహేశ్వర రావు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (08:50 IST)
అవినీతి కేసుల్లో పీకల్లోతుకు కూరుకుపోయిన జగన్‌కు కొత్తచట్టం పేరు చెబితేనే పిచ్చెక్కుతోందని ఏపీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. పట్టిసీమ, పోలవరం విషయంలో జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
పోలవరం పనులు చేస్తున్న ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీకి పనులు అప్పగిస్తూ 2013లో అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలుసా? అని జగన్‌ను ప్రశ్నించారు. 2010లో ఈ పథకాన్ని చేపట్టాలని భావించినా.. అప్పట్లో ఈ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు వెనక్కు తగ్గిపోయిన విషయం గుర్తు లేదా? అని నిలదీశారు. 
 
టీడీపీ అధికారంలోకి వచ్చేంత వరకూ.. ఏడు ముంపు గ్రామాల్లో నాలుగింటిలో భూ సేకరణ, పరిహారం చెల్లింపును చేపట్టాకే పనులు వేగవంతం అయినట్లు తెలియదా? అని ప్రశ్నించారు. ఒప్పందంలోని నిబంధనల మేరకు 252 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేశాకే బ్యాంకు గ్యారెంటీ తీసుకుని 290 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్సును ఇచ్చామని తెలియదా? అని ప్రశ్నించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments