Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి.

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (22:20 IST)
రాయచోటి నియోజక వర్గంలోని అభివృద్ధి పనులలో వేగం పెంచాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులును ఆదేశించారు శ్రీకాంత్ రెడ్డి. గురువారం తన కార్యాలయంలో జెడ్పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డిలతో కలసి పంచాయతీ రాజ్ ఈ ఈ రామచంద్రా రెడ్డి, పి ఐ యు ఈ ఈ శ్యామ్ సుందర్ రాజు, డి ఈ గోపాల్ రెడ్డి లతో నియోజక వర్గ పరిధిలో జరుగుచున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ఆయన మండలాల వారీగా ఆరా తీశారు.

రహదారుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవన  నిర్మాణాలపై ఆయన గ్రామాల వారీగా ఆరా తీశారు. జులై 8 న అధిక సంఖ్యలో గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల భవనాలు ప్రారంభాలకు నోచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతగా ,త్వరితగతిన చేపట్టాలని అధికారులుకు  శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో మండల ఇంజనీరింగ్ అధికారులు, సర్పంచ్ ముసల్ రెడ్డి,వైఎస్ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments