Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని కోరుకున్నా: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:59 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రశంసనీయమన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 
 
దర్శనం తర్వాత ఆలయం వెలుపల మీడియాతో డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలోనూ, విద్యార్థుల ఉన్నతవిద్యకు పెద్దపీట వేయడంలోను ముఖ్యమంత్రి చొరవ అభినందనీయమన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడంలోనూ, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం లోనూ సిఎం సఫలీకృతులయ్యారన్నారు. 
 
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. చాలా రోజుల తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. కరోనా ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాలని కూడా శ్రీవారిని ప్రార్థించానన్నారు డిప్యూటీ స్పీకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments