Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని కోరుకున్నా: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:59 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రశంసనీయమన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 
 
దర్శనం తర్వాత ఆలయం వెలుపల మీడియాతో డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలోనూ, విద్యార్థుల ఉన్నతవిద్యకు పెద్దపీట వేయడంలోను ముఖ్యమంత్రి చొరవ అభినందనీయమన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడంలోనూ, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం లోనూ సిఎం సఫలీకృతులయ్యారన్నారు. 
 
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. చాలా రోజుల తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. కరోనా ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాలని కూడా శ్రీవారిని ప్రార్థించానన్నారు డిప్యూటీ స్పీకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments