Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (14:59 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాత్రం ఓట్లు వేశారు. వీరిద్దరూ ఓటు వేయంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటు వేయలేదన్న సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. దీనికి కారణం.. పవన్ కళ్యాణ్ పట్టభద్రుడు కాకపోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. 
 
గుంటూరు - కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయన డిగ్రీని పూర్తి చేయలేదు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments