Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూరపు ఆలోచనతో పాలన సాగిస్తున్న సీఎం జ‌గ‌న్... అందుకే కొత్త జిల్లాలు

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:34 IST)
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష సానుకూలంగా కామెంట్స్ చేశారు. కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అభినందనీయం అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఒక్కో హామీ నెరవేర్చుతున్నార‌ని ముఖ్యమంత్రిని కొనియాడారు. 
 
 
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచ‌న అని, ఇపుడు 26 జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తామ‌ని చెప్పారు. కొత్త జిల్లాల‌తో ఇలాంటి మహత్త‌ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయం అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. 
 
 
విభజన అనంతరం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింద‌ని, అయినా దూరపు ఆలోచనతో ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నార‌ని అంజాద్ భాషా అన్నారు. వికేంద్రీకరణ తో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చార‌ని, దానిని ఇపుడు నెర‌వేచ్చార‌న్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పరిపాలన అందిస్తున్నార‌ని, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నార‌ని వివ‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments