Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండ

Webdunia
గురువారం, 13 జులై 2017 (10:15 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండంగా మారి ప్రభావం చూపుతుంది. ఫలితంగా జూలై 16, 17, 18 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవన కాలంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. ఆ జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే సూచనలున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments