Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండ

Webdunia
గురువారం, 13 జులై 2017 (10:15 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండంగా మారి ప్రభావం చూపుతుంది. ఫలితంగా జూలై 16, 17, 18 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవన కాలంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. ఆ జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే సూచనలున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments