Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో సహనం నశిస్తోంది... రోజులు గడుస్తున్నా సమస్యను చక్కదిద్దరేం : మోడీకి చంద్రబాబు ప్రశ్న

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కల్లోల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రజల్లో ఓర్పు, సహనం నశిస్తోం

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (08:58 IST)
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కల్లోల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రజల్లో ఓర్పు, సహనం నశిస్తోందంటూ వ్యాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి రోజులు గడుస్తున్నా పరిస్థితులను చక్కదిద్దరేమంటూ ప్రశ్నించారు. పైగా ఒక సమస్య ఇన్నాళ్లపాటు పరిష్కారం కాకపోవడాన్ని తొలిసారి చూస్తున్నాను. ఈ పరిస్థితితో నాకే అసహనంగా ఉంది. ప్రజల సహనాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. 
 
నోట్ల రద్దు అంశంపై ఆయన ఆదివారం కలెక్టర్లు, ఆర్బీఐ, ఎస్ఎల్‌బీసీ, ఆర్థిక శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చెలామణిలోకి తెచ్చిన రూ.2000 నోట్లను రద్దు చేసి.. తిరిగి రూ.200, రూ.100 నోట్ల కరెన్సీని ప్రవేశపెట్టాలన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నిరుపేదల నుంచి అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చిన రెండువేల కోట్లలో వంద నోట్లు రూ.400 కోట్లు ఉన్నాయని తెలిపారు.
 
అన్ని బ్యాంకులు సమన్వయంగా పనిచేయాలని, ప్రజలు ఇబ్బందులను బ్యాంకర్లు, అధికారులు గమనించి, తక్షణం ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని బ్యాంకర్లకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని, సకాలంలో దిశానిర్దేశం చేసే సీనియర్‌ అధికారులను జిల్లాల్లో నియమించాలని బ్యాంకర్లకు సూచించారు. జన్‌ధన్ ఖాతాలు, రూపే కార్డులను తక్షణం క్రియాశీలం చేయాలన్నారు. సమన్వయంతో పనిచేయని బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments