Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురేవి ... ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన వాయుగండం

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (09:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. ఈ తుఫాను అపారనష్టాన్ని మిగిల్చింది. అయితే, ఈ తుఫాను సృష్టించిన అలజడి నుంచి కోలుకోకముందే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారగా, దీనికి బురేవి అనే పేరు పెట్టారు.
 
అయితే, వాయుగుండం కాస్త తీవ్రవాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది శ్రీలంకకు సమీపంలో కొనసాగుతోంది. ఈ తుఫానును బురేవిగా పిలవనున్నారు. ప్రస్తుతం ఈ తుఫాను శ్రీలంకలోని ట్రింకోమలీ తీరానికి తూర్పు, ఆగ్నేయ దిశగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
 
బురేవి డిసెంబరు 2 సాయంత్రం తర్వాత ట్రింకోమలీ రేవు పట్టణం సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. డిసెంబరు 3 ఉదయం మన్నార్ సింధుశాఖలో ప్రవేశించి దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకుతుందని వివరించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఇంతకుముందు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments