Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు కొండచరియలు విరిగిపడి.. 14జవాన్లు మృతి.. తెలుగు సైనికుడు కూడా?

విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చ

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (17:03 IST)
విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది. వీరిలో ఓ తెలుగు జవాన్ కూడా మరణించినట్లు సైనికాధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) భారత సైన్యంలో పనిచేశాడు. 
 
అయితే మంచు కారణంగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.
 
మరోవైపు గురెజ్ సెక్టార్‌లో సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ సిబ్బంది ఇప్పటివరకు ఆరుగురు జవాన్లను రక్షించారు. ఇంకా మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments