Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన కర్ఫ్యూ.. వాహనరాకపోకలు బంద్

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:32 IST)
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతో ఏపీ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రా సరిహద్దులను మూసివేసింది. 
 
రామాపురం (కోదాడ), పొందుగుల (వాడపల్లి), నాగార్జునసాగర్ (మాచర్ల వైపు) మూడు చెక్ పోస్టులను మూసివేసింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దుల వద్ద వాహనాలు బారులు తీరాయి. అత్యవసర సేవలు మినహా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు.  
 
కాగా, బుధవారం నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారమే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుండగా విమాన, రైల్వే ప్రయాణికులు మాత్రం టికెట్లు చూపిస్తే మాత్రం అనుమతిస్తారు. 
 
ఇక, కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ,అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బందికి ఆంక్షల నుంచి మిహాయింపు ఇచ్చారు. అలాగే, మీడియాకు కూడా అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments