Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని లొంగదీసుకున్న మామ, మాయలో పడి భర్తను చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:28 IST)
కోడలు అంటే కూతురుతో సమానం అంటారు. కానీ ఇక్కడ ఈ మామ కోడలి పట్ల కామాంధుడయ్యాడు. ఒకవైపు భర్త తాగుబోతు కావడంతో ఆ మామ పని సుళువైంది. కోడలిని లొంగదీసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. మామతో కమిట్ అయిన కోడలు ఇక తాగుబోతు భర్త ఎందుకని, ఇద్దరూ కలిసి అతడిని హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 35 ఏళ్ల లక్ష్మయ్యకు వినుకొండకు చెందిన సునీతకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగ పిల్లలు కూడా పుట్టారు. కాగా లక్ష్మయ్య తల్లి 30 ఏళ్ల క్రితం చనిపోయింది. మరోవైపు లక్ష్మయ్యకు తాగుడు అలవాటు వుంది. భార్యను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అర్థరాత్రి వచ్చి వున్నది తిని గురకపెట్టి నిద్రపోయేవాడు. మళ్లీ ఉదయం షరా మామూలే.
 
కొడుకుకి సర్దిచెప్పి అతడి తాగుడును మాన్పించాల్సిన తండ్రి, తన కోడలిపై కన్నేశాడు. కుమారుడు ఇంట్లో లేని సమయంలో కోడలిపై అఘాయిత్యం చేసాడు. ఇక అప్పట్నుంచి ఆమెతో లైంగికంగా కలుస్తూ వచ్చాడు. మామకి ఫుల్లు సపోర్టుగా మారిన కోడలు తమ సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడని, మొన్న ఆదివారం అర్థరాత్రి మారణాయుధాలతో అతడు గాఢ నిద్రలో వున్నప్పుడు హత్య చేసేసారు. ఐతే ఆ హత్యను పక్కదారి పట్టించాలని చూసారు కానీ సునీత పెద్ద కుమారుడు, ఆ హత్య చేసింది తన తల్లి, తాతలు అని చెప్పడంతో పోలీసులు వారిని అరెస్టు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం