Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బీజేపీకి మరో అసెంబ్లీ సీటు వస్తుంది : బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి

వరుణ్
శుక్రవారం, 29 మార్చి 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మరో అసెంబ్లీ సీటు అంటే 11వ సీటు రానుందని, ఆ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. తమ పార్టీలో ఉన్నపాతవారు, కొత్తవారు అందరూ బీజేపీ నేతలేనని చెప్పారు. తమ పార్టీకి ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయని తెలిపారు. త్వరలోనే మరో సీటు వస్తుందన్నారు. ఆ 11వ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. 
 
తమ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భవితవ్యాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. తమ పార్టీలోకి వలస వచ్చినవారికి మాత్రమే టిక్కెట్లు కేటాయించిందంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. స్థానిక పరిస్థితులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ పక్కనపెట్టలేదన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడివుండాలన్నారు. కాగా, ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments