Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (12:35 IST)
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన సౌర విద్యుత్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా? అని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ, అదానీ ఒప్పందంపై అమెరికా లేఖను పూర్తిగా చదవాల్సి వుందన్నారు. అమెరికా రాసిన లేఖలో నాలుగు రాష్ట్రాల పేర్లు ఉన్నాయని, పైగా, ఈ ఒప్పందాలన్నీ జగన్‌కు తెలియకుండానే జరిగాయా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. 
 
అదేసమయంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజార్టీ వచ్చిందనీ, ఏపీలో మూడు బలమైన పార్టీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తమ పార్టీలో 25 లక్షల మంది కొత్తగా చేరారని వెల్లడించారు. సంస్థగత ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరమన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అర్హత ఉందన్నారు. గతంలో మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments