గురుశిష్యులైన చంద్రబాబు, కేసీఆర్ కొట్లాడుకోవడం మాని, పరస్పరం సహకరించుకోవడం ద్వారా తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలని టీకాంగ్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ సూచించారు. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని డీఎస్ పేర్కొన్నారు.
మన రాష్ట్రం-మన పాలన అని తెలంగాణను తెచ్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు తలకొట్టుకునేలా ఉందని డీఎస్ వాపోయారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఎజెండాతో కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్లో చేరితేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తామని బెదిరించడం సరికాదని డీఎస్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు, రైతులకు సమర్ధవంతమైన పాలన అందవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీఎస్ విమర్శించారు.