తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (13:33 IST)
బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది. ఇది మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది.  
 
ఈ వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారితే దానికి సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాలు, యానాంలో ఈ నెల 29వ తేదీన భారీ వర్షాలు, 30వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, ఈ నెల 27, 28వ తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. 
 
తమిళనాడులో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న ఆరు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, కొమోరిన్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక సమీపంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments