Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల వద్ద తీరం దాటిన మిచౌంగ్ పెనుతుఫాన్, కోస్తాంధ్రలో దంచికొడుతున్న భారీ వర్షాలు

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (17:13 IST)
బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వద్ద మిచౌంగ్ పెనుతుఫాను తీరాన్ని పూర్తిగా దాటింది. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తీరాన్ని తాకిన పెనుతుఫాన్, పూర్తిగా తీరాన్ని దాటేందుకు రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం రెండున్నరకు తీరాన్ని పూర్తిగా దాటింది. దీని ప్రభావంతో బాపట్ల తీరం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
తీరం దాటిన తుఫాను ప్రస్తుతం బాపట్లకి 15 కి.మీ దూరంలోనూ ఒంగోలుకి ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పెనుతుఫాన్ ఉత్తర దిశగా ప్రయాణం చేసి క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు. మరోవైపు దీని ప్రభావంతో పశ్చిమ ఆంధ్ర, దక్షణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments