Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (16:43 IST)
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం మధ్యాహ్నానికి కారైక్కాల్ - మహాబలిపురం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తు్న్నారు. ఈ తుఫానుకు ఫెంగల్ అని నామకరణం చేసిన విషయంతెల్సిందే.
 
దీని ప్రభావం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్టంగా గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన వారు తక్షణం తీరానికి తిరిగి రావాలని కోరింది. 
 
ఇదిలావుంటే, తుఫాను నేపథ్యంలో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. రాష్ట్రంలో మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments