Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి విజయవాడ.. 13 కిలోల స్మగ్లింగ్ గోల్డ్ బిస్కెట్లు సీజ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:43 IST)
విజయవాడలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
13 కిలోల బంగారం బిస్కెట్లను సీజ్ చేసి.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కారులో సోదాలు చేశారు. 
 
ఈ బంగారం బిస్కెట్లను బ్యాగుల్లో పెట్టుకుని నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఆ బ్యాగుల్ని పరిశీలించగా.. గోల్డ్ బిస్కెట్లు కనిపించాయి. వాటిపై ఫారెన్ మార్క్‌ చేసి ఉంది. అరెస్ట్ చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఇది విదేశీ బంగారమని.. దీని విలువ రూ.8కోట్ల వరకు వుంటుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.32.8 కోట్ల విలువచేసే 59.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments