Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చెయ్యి తియ్‌... నిన్ను కూడా సెంట్రల్‌ జైలుకు పంపే కార్యక్రమం కూడా చేస్తా' : ఆస్పత్రిలో జగన్‌ హల్‌చల్‌

వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో హల్‌చల్ సృష్టించారు. మంగళవారం జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన ప్రయాణికులను ఆయన పరామర్శించారు.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (12:32 IST)
వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో హల్‌చల్ సృష్టించారు. మంగళవారం జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన ప్రయాణికులను ఆయన పరామర్శించారు. 
 
అలాగే, ఈ ప్రమాదంలో మరణించిన వారికి శవపరీక్షలు చేశారు. ఆ పోస్టుమార్టం నివేదికను ఆయన వైద్యులను అడిగి తీసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టమ్‌ నివేదికను జగన్ జేబులో పెట్టుకోబోతుండగా వైద్యులు ‘‘సార్‌.. సార్‌... అవి ఒరిజినల్‌ రిపోర్టులు. మీకు ఫొటోస్టాట్‌ ఇస్తాం’’ అని ఆపబోయారు. 
 
దీనికి జగన్.. ‘‘మూడు కాపీలు ఉన్నప్పుడు ఒక కాపీ ఇవ్వడానికి ఏంటి?’’ అంటూ వాగ్వాదానికి దిగారు. నివేదికను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ‘‘చెయ్యి తియ్‌.... చెయ్యి తియ్‌....’’ అంటూ వాటిని ఆయన లాక్కున్నారు. ‘‘ఇది డాక్టర్‌ కాపీ సార్‌....’’ అని చెప్పగా.. ‘‘నేను ప్రతిపక్ష నాయకుడ్ని. నాకే నివేదిక ఇవ్వరా?’’ అని మండిపడ్డారు. 
 
ఆ దశలో జిల్లా కలెక్టర్‌ బాబు జోక్యం చేసుకుని జగన్ నుంచి పోస్టుమార్టం నివేదికను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా, ‘‘పోలీసుల నుంచి కలెక్టర్‌ దాకా అధికారులందరూ అవినీతిపరులు’’ అని తీవ్రస్వరంతో అన్నారు. నిన్ను కూడా సెంట్రల్‌ జైలుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం. గుర్తుపెట్టుకోండి అంటూ కలెక్టర్‌ ఒంటిపై చేయి వేసి హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జగన్‌పై నందిగామలో క్రిమినల్ కేసు నమోదైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments