Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల గారు... అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప‌రనిందలేల!

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (20:30 IST)
అమరావతి రాజధాని విషయంలో వైసిపి చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర పార్టీలపై నిందలు వేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వై ఎస్ ఆర్ సి పి రాజధాని అంశాన్ని అవకాశవాదంగా మార్చుకుంద‌ని విమ‌ర్శించారు. 
 
వైసిపి తీసుకున్న 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సమర్థించిందా? అమరావతి రాజధానిగా ఉండటం సరైన నిర్ణయం అని వైసిపి ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు సిపిఐ, కాంగ్రెస్, బిజెపి, జనసేన, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తున్నాయని సజ్జల చెప్పటం భావ్యమేనా? అని రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు.
 
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు కోరినప్పుడు సిపిఐ పార్టీగా మేము దాన్ని వ్యతిరేకించిన విషయం సజ్జల గారు మరిచారా? 'మాట మార్చం -  మడమ తిప్పం' అన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట మార్చి, మడం తిప్పారా లేదా? వైసిపి గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, ఇప్పుడు ఇతరులపై నిందలేయడం తగునా? అన్నారు.
 
తిరుపతిలో అమరావతి రైతుల సభకు పోటీగా మీరు సభ పెట్టి ఫెయిల్ అయ్యార‌ని, అధిక ధరలు, పన్నుల భారాలు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, విద్యుత్ ఛార్జీల పెంపుదల వంటి పలు అంశాల్లో మాట తప్పిన ప్రభుత్వం వైసీపీ అని పరనింద లేసేముందు  స్వయంకృతాపరాధాలు  వైసీపీ గుర్తెరగాల‌ని సూచించారు. సజ్జల గారు... ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మీరు విజ్ఞత మరచి మాట్లాడటం సరికాద‌ని రామకృష్ణ హిత‌వు ప‌లికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments