Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డీఓ చేతులు నరుకుతాం: నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (19:07 IST)
ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ సంచలనానికి మారుపేరుగా నిలిచిన సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మరోసారి అలాంటి పనే చేశారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ మహిళా అధికారిణి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తోంది.
 
చిత్తూరు-పర్చూరు జాతీయ రహదారి నిర్మాణం కోసం రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటోంది. దీంతో సిపిఐ నారాయణకు చెందిన ఒకటిన్నర ఎకరం స్థలం కూడా పోతోంది. 
 
నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాలని సిపిఐ నారాయణ అధికారులను కోరారు. పంటలు పండించుకునే పొలాన్ని లాక్కోవడం సరైంది కాదంటూ రైతులతో కలిసి పాదయాత్ర చేశారు.
 
నేరుగా చిత్తూరు ఆర్డీఓను కలిశారు సిపిఐ నారాయణ. చిత్తూరు ఆర్డీఓ రేణుక. అయితే ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సిపిఐ నారాయణకు కోపమొచ్చింది. రైతుల భూములను బలవంతంగా ఆర్డీఓ లాక్కోవాలని చూస్తున్నారని.. ఆమె చేతులను నరకడానికైనా రైతులు వెనుకడుగు వేయరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
చిత్తూరు ఆర్డీఓ ప్రభుత్వ అధికారిణిగా కాకుండా డాన్‌గా మారిపోయారంటూ మండిపడ్డారు. తన స్థలానికే దిక్కు లేకుంటే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు సిపిఐ నారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments