Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకాల పంపిణీ బంద్... ఎందుకంటే..

Webdunia
సోమవారం, 10 మే 2021 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు(సోమ, మంగళ) పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపి వేస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 
ఇకపై వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర జనం గుమిగూడితే అధికారులపై చర్యలు తీసుకోనుంది. ఇదిలావుంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారాన్ని స్లిప్పుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అటు రెండో డోసు పూర్తయ్యేకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 
 
మరోవైపు, ఏపీలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి పెరిగింది.
 
ఇక తాజాగా రాష్ట్రంలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,844 కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 18,832 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 12,87,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,88,264 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,90,632 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments