Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 572కు చేరిన కరోనా కేసులు.. దేశంలో 452 మరణాలు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (21:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 572కు చేరింది. శుక్రవారం కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 572కు చేరాయి. ఇకపోతే, ఇప్పటివరకు మొత్తం 14 మంది చనిపోగా, మరో 35 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. 
 
572 మంది కరోనా పాజిటివ్ కేసుల్లో 523 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం గుంటూరులో నాలుగు కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు మూడో స్థానంలోనూ, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 
 
ఇకపోతే, దేశంలో కూడా మొత్తం కరోనా కేసుల సంఖ్య 13835కు చేరగా, ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 452కు చేరింది. ప్రస్తుతం దేశంలో 11,616 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1766 మంది కోలుకున్నట్టు తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments