Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చటి సీమలో కరోనా కల్లోలం : తూగో జిల్లాల్లో ఒకే రోజు 28 కేసులు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చటి సీమగా పేరుగాంచిన కోనసీమ జిల్లాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
నిజానికి లాక్డౌన్ సమయంలో ఈ జిల్లాల్లో నమోదైన కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 
 
ప్రధానంగా ముంబైతోపాటు.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల కారణంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కోనసీమ వాసులు వణికిపోతున్నారు. 
 
తాజాగా నమోదైన 28 కరోనా కేసుల్లో రాజోలు క్వారంటైన్‌లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసుల కారణంగా కోనసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments