కామాంధుల వేధింపులు భరించలేను.. పిల్లలను చంపి సూసైడ్ చేసుకుంటున్నా

ఇటీవల విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య చేసుకున్న కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ఇపుడు కీలకమైన ఆధారంగా భావించే సూసైడ్ నోట్ లభించింది.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (12:17 IST)
ఇటీవల విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య చేసుకున్న కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ఇపుడు కీలకమైన ఆధారంగా భావించే సూసైడ్ నోట్ లభించింది. 
 
విశాఖ, ఆరిలోవలోని ముస్తఫా కాలనీలో సౌమ్య, రాజేష్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలైన విష్ణుతేజ, జాహ్నవీలను చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, సౌమ్య ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను రాసిపెట్టింది. ఈ నోట్‌లో సౌమ్య సంచలన ఆరోపణలు చేసింది. 
 
తమ చుట్టూ చాలామంది కామాంధులు తిరుగుతున్నారనీ, వారి వేధింపులు, బ్లాక్‌మెయిల్స్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని అందులో పేర్కొంది. చాలా చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నానని, ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తర్వాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా తీసుకెళుతున్నానని సూసైడ్ నోట్‌లో రాసింది. 
 
అయితే, రాజేష్ కూడా ఆత్మహత్యకు ఎందుకు ఉపక్రమించాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని కనుగొనేందుకు పలు కోణాల్లో కేసును విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments