Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పు కోసం ఆస్పత్రికెళితే కడుపులో కాటన్ పెట్టి కుట్లేశారు.. వైద్యురాలి నిర్లక్ష్యం

నెల్లూరులో ఓ ప్రైవేట్ వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే ఆ వైద్యురాలు కడుపులో కాటన్‌ (దూది) పెట్టి కుట్లువేసింది. ఈ సంఘటన నెల్లూరులోని

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (10:50 IST)
నెల్లూరులో ఓ ప్రైవేట్ వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే ఆ వైద్యురాలు కడుపులో కాటన్‌ (దూది) పెట్టి కుట్లువేసింది. ఈ సంఘటన నెల్లూరులోని నవాబుపేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గత జూలై 14న లక్ష్మీ శ్రావణి (33) ప్రసవ వేదనతో స్థానిక సులోచనమ్మ నర్సింగ్‌ హోమ్‌కు వచ్చింది. డాక్టర్‌ సులోచన ఆమెకు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీసింది. అయితే శస్త్రచికిత్స సమయంలో కడుపులో దూదిపెట్టి కుట్లు వేశారు. దీంతో దీర్ఘకాలంలో శ్రావణికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో గత నెల 25న ఆమెను నెల్లూరులోని సింహపురి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అక్కడ స్కానింగ్‌ చేసిన వైద్యులు కడుపులో పెద్ద మొత్తంలో దూది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స ద్వారా ఆ దూదిని తొలగించడంతో ప్రస్తుతం శ్రావణి కోలుకుంటోంది. దీనిపై బాధిత మహిళ బంధువులు సులోచనమ్మ నర్సింగ్‌ హోమ్‌ వద్ద శనివారం ఆందోళనకు దిగి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments