Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో తహసీల్దారుకు కరోనా.. నేతల్లో వణుకు!

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా విధుల్లో నిమగ్నమైవున్న ఓ తహసీల్దారుకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో కలిసి కరోనా సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈ ఘటన అనంతపుర జిల్లా మడకశిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌ గత కొన్ని రోజులుగా దగ్గు, జ్వరం, జలుబుతో బాధపుడున్నాడు. దీంతో ఆయనకు పరీక్షలు చేయగా, వాటిలో కరోనా పాజిటివ్ అని తేలింది. తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగులు, రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. 
 
ఈ తహసీల్దార్ మడకశిర ఎమ్మెల్యేతో పలుసార్లు సమావేశమయ్యారు. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.
 
ఇదిలావుండగా, ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఏపీలో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటిరకూ 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 15 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments