Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. అదేవిధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు.
 
ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో షరీఫ్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. మరోవైపు ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసుల విషయంలో తమిళనాడును వెనక్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది.
 
ఆగస్టు 31 తేదీ సాయంత్రానికి ఆంధ్రాలో 4,34,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,00,276 యాక్టివ్ కేసులుండగా 3,30,526 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,969కి చేరింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments