Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. అదేవిధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు.
 
ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో షరీఫ్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. మరోవైపు ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసుల విషయంలో తమిళనాడును వెనక్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది.
 
ఆగస్టు 31 తేదీ సాయంత్రానికి ఆంధ్రాలో 4,34,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,00,276 యాక్టివ్ కేసులుండగా 3,30,526 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,969కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments