Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కేసులు తగ్గట్లేదు, చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ పొడిగింపు, సమయం కుదింపు

Webdunia
శనివారం, 29 మే 2021 (20:30 IST)
చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల పెరిగిపోతున్నాయి. అందుకు కారణం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పక్కపక్కన ఉండటమే. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే సమయాన్ని మరింతగా కుదిస్తున్నాం. 
 
ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతినిచ్చాం. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని 10 గంటల వరకే పెడుతున్నాం. జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సమయం ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా కర్ఫ్యూకు అందరు సహకరించాలని విజ్ఙప్తి చేశారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.
 
తిరుపతిలోని వెటర్నరీ కళాశాలలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు మంత్రులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎపిలో వేగంగా జరుగుతోందని.. ఆగష్టు నెల లోపల ఎపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments