Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను ఓడించిన కేరళ వృద్ధ దంపతులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:53 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం సాగింది. కానీ, ఈ వృద్ధ దంపతులు మాత్రం అది తప్పు అని నిరూపించారు. ఈ వృద్ధ దంపతులు కరోనాను జయించారు. ఫలితంగా వారిద్దరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంటకు కరోనా సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. వారిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మీడియా జరుగుతున్న ప్రచారంతో బాధితుల కుటుంబీకులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిపై ఆశలు వదులుకున్నారు.
 
కానీ, ఆ వృద్ధ జంట కరోనాను జయించింది. వీరిలో వృద్ధ భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments