Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి బాధలు తీరుస్తున్న నాట్స్, గుంటూరులో నిరుపేదలకు 3 రోజుల పాటు ఆహార పంపిణి

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (18:54 IST)
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా కరోనా నియంత్రణకు పెట్టిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు నాట్స్ ముందుకొచ్చింది. గుంటూరు నగరం పూర్తిగా రెడ్ జోన్‌లో ఉండటంతో ఇక్కడ శివారు ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆకలిబాధలు తప్పడం లేదు. 
 
ఈ విషయాన్ని స్థానికంగా ఉండే కిట్స్ కాలేజీ నాట్స్ దృష్టికి తీసుకురావడంతో నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తక్షణమే స్పందించారు. గుంటూరు శివారు ప్రాంతాల్లో పేదల ఆకలిబాధలు తీర్చడానికి ఆర్థికసాయం అందించారు. కిట్స్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ సోసైటీ సభ్యులు, శ్రీవన అన్నదాన సంఘానికి చెందిన అనుమలశెట్టి మల్లికార్జున, చైతన్యలతో పాటు ప్రొఫెసర్ ఆతుకూరి రాఘవ, సీతారాంల సహాకారంతో నాట్స్ పేదలకు ఉచితంగా ఆహారపొట్లాలు అందించింది. 
 
ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు సాగనుంది. నేటి నుండి  మూడు రోజులపాటు నిరుపేద కార్మిక కాలనీ వాసులకు ఉచితంగా ఆహారపొట్లాలు అందించనుంది. త్వరలో పేదలకు మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణి చేయాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి భావిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆకలిబాధలు పడుతున్న తమకు నాట్స్ చేస్తున్న సాయం మరువలేనిదని నిరుపేదలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments