Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎఎస్ అధికారుల విరాళం రూ.20 లక్షలు

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:19 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులు తమదైన శైలిలో స్పందించారు. కరోనా కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 162 మంది అధికారులు తమ మూడు రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఐఎఎస్ అదికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

మూడు రోజుల జీతంగా రూ.20 లక్షలు తాము ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నామని, ఈ క్రమంలో తమ జీతాల నుండి ఆ మొత్తాలను మినహాయించాలని ఆర్ధిక శాఖ కార్యదర్శికి లేఖ రాసామని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు  తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నామని ప్రవీణ్ కుమార్ వివరించారు.

రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు కరోనా వ్యాప్తి నిరోధం నేపధ్యంలో విభిన్న బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని, విపత్కర పరిస్ధితిలో పాలనా యంత్రాంగాన్ని సిఎం అదేశాల మేరకు ముందుకు నడిపించటంలో తమదైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఎటువంటి బాధ్యతలనైనా నిర్వర్తించేందుకు అఖిల భారత సర్వీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments