Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్ పంపండి, స్వామివారిని దర్సించుకోవాలి, భక్తుల వేడుకోలు

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (20:09 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్సించుకోవడమంటే ఒక మహద్భాగ్యం. తిరుపతికి వచ్చే భక్తులందరూ అదే అనుకుంటూ ఉంటారు. స్వామివారిని ఎలాగైనా దర్సించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. రద్దీ తక్కువగా ఉండాలని.. స్వామివారిని ఎక్కువసేపు దర్సించుకోవాలని భావిస్తుంటారు.
 
కాలి బాటన వెళ్ళే భక్తులైతే గోవింద నామస్మరణలతో తన్మయత్వంతో రెండు చేతులు జోడిస్తూ దణ్ణం పెడుతూ మెట్లపై ఎక్కుతూ తిరుమలకు చేరుతుంటారు. ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమలకు వస్తుంటారు. స్వామివారికి మ్రొక్కు తీర్చుకుంటే మంచి జరుగుతుందన్నది భక్తులు ప్రగాఢ నమ్మకం. 
 
కోరిన కోర్కెలు తీరాలన్నా.. కష్టాల నుంచి బయటపడాలన్నా ఆ వైకుంఠ నాథుడే తమకు శ్రీరామరక్ష అని భక్తులు భావిస్తుంటారు. అలాంటి భక్తులకు స్వామివారి దర్సనం ఇప్పుడు లేదు. కరోనా ప్రభావంతో వారంరోజుల పాటు భక్తులను దర్సనానికి అనుమతించకుండా టిటిడి నిలిపివేసింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులలో చాలామందికి సమాచారం తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
 
తిరుపతిలోని అలిపిరి వద్దకు వచ్చి మూసేసిన గేట్లను తదేకంగా చూస్తున్నారు. సర్.. తలుపులు ఎప్పుడు తెరుస్తారు.. మమ్మల్ని స్వామి దర్సనానికి పంపిస్తారా అంటూ టిటిడి సిబ్బందిని ప్రాథేయపడుతున్నారు. వారంరోజుల పాటు దర్సనం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు కొంతమంది భక్తులు. దీంతో టిటిడి సిబ్బంది వారికి నచ్చజెప్పి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments