ఆంధ్రాలో కొత్తగా మరో 44 కరోనా కేసులు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (15:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 647కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. 
 
గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 26, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, గుంటూరులో 3, విశాఖపట్నం 1 కరోనా కేసులు నమోదైనట్టుగా తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 65 మంది డిశ్చార్జ్‌ కాగా, 17 మంది మరణించారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 565 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. 
 
కాగా, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 158 మంది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 23 మందిని డిశ్చార్జ్‌ చేశారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో 9, వైఎస్సార్‌ కడప జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 3, తూర్ప గోదావరిలో 2 ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments