Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. పుణ్యక్షేత్రాలు మొత్తం ఖాళీ

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (22:20 IST)
ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్సించే భక్తులు సంఖ్య ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ప్రధాన క్షేత్రాలైతే ఇక చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. చిత్తూరు జిల్లాలో వున్నటువంటి పుణ్యక్షేత్రాలైతే ఇక చెప్పనవసరం లేదు. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్సించుకుంటూ ఉంటారు. వారాంతాల్లో అయితే లక్షమందికి పైగా భక్తులు వస్తుంటారు. ఇది తెలిసిన విషయమే.
 
అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో తిరుమల మాత్రమే కాదు అనుబంధ ఆలయాలన్నీ పూర్తిగా మూసివేశారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామికి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామాలయం మొత్తం మూసేశారు. 
 
ఆలయాల వద్ద అస్సలు భక్తులు లేరు. తిరుమలలో మాత్రం భక్తులు అక్కడక్కడా ఉన్నా.. వారిని కూడా టిటిడి కిందకు దింపేస్తోంది. ఇక మిగిలిన ఆలయాల వద్ద అస్సలు భక్తుల తాకిడి కనిపించలేదు. మరో ప్రధాన విషయమేమిటంటే బ్రహ్మోత్సవాలను ఆలయంలోపలే నిర్వహించబోతోంది టిటిడి. అది కూడా కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు ఈనెల 23వ తేదీ నుంచి నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.
 
అయితే కరోనా ప్రభావంతో ఆలయాన్ని మూసేస్తారు కాబట్టి.. ఆలయంలోపలే వాహన సేవలు కొనసాగబోతున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయం లోపలే వాహనాలపై ఊరేగనున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదంటోంది టిటిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments