Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి : ఆనవాయితీకి తిలోదకాలు!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (18:38 IST)
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆది నుంచి వస్తున్న ఆనవాయితీని ఆ పార్టీ నేతలు తిలోదకాలిచ్చారు. 
 
సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలపకపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. తమ అభ్యర్థిని బరిలో దింపింది. 
 
కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే సుగుణమ్మ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వెంకటరమణ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని అన్నారు. 
 
కాగా, తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీడీపీ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను బరిలో నిలుపగా, వైకాపా పోటీకి దూరంగా ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని బరిలోకి దించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments