Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్లీనరీలో ప్రత్యేక హోదా తీర్మానం.. సోనియా నిర్ణయం

తాము చేసిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (08:45 IST)
తాము చేసిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ఆ పార్టీ తమవంతు కృషిచేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలన్న తీర్మానం చేయనుంది. దీనిపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు, ప్లీనరీ ఆమోదించనున్నట్లు తెలిసింది. 
 
పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో ప్లీనరీ ప్రారంభం కానుంది. ఉదయం రాహుల్‌గాంధీ చేసే ప్రసంగం, తీర్మానాలు కాంగ్రెస్‌ భావి రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. మిత్రపక్షాలను కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ ఏం చేస్తుందనే విషయం ఈ తీర్మానాల్లో స్పష్టం కానుంది. రాహుల్‌ అధ్యక్షుడుగా ఎన్నిక కావడాన్ని ప్లీనరీలో పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించనున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం