Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నీరాజనాలు పలకండి: సిపిఐ శ్రేణులకు రామకృష్ణ పిలుపు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:01 IST)
నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సిపిఐ శ్రేణులు ఘన స్వాగతం పలికి, పాదయాత్రలో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.
 
ఈ మేరకు కె రామకృష్ణ మేరకు నేదోక ప్రకటన విడుదల చేశారు. "అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతుల 45 రోజుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరుగుతుంది. రైతుల పాదయాత్ర ఆయా జిల్లాలలోకి ప్రవేశించినప్పుడు సిపిఐ తరపున ఘనస్వాగతం పలికి, పార్టీ శ్రేణులు తప్పక పాదయాత్రలో పాల్గొనాలి.

సిపిఐ నియోజకవర్గ నాయకత్వం, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రకు స్వాగతం పలికి, నియోజకవర్గం వరకు తప్పక పాల్గొనాలి. తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం.

రైతుల మహాపాదయాత్రతోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం"  అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments