Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో కరోనా రోగుల ఆందోళన

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:07 IST)
సమయానికి భోజనం పెట్టడం లేదంటూ కర్నూలు విశ్వ భారతి కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులు మంగళ వారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. 3 గంటలైనా భోజనం ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన రోగులు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు.

విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సోమవారం రాత్రి 10.30 సమయంలో తమను ఒక భవనం నుండి మరో భవనానికి తరలించారని, దాంతో రోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం కూడా 10.40 వరకూ టిఫిన్ ఇవ్వలేదని, షుగర్, బిపి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని తెలిపారు.

ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. రోగులు భోజనం విషయం ఆందోళన చేస్తే వెళ్ళిపోయెందుకు ఆసక్తి ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తే డిశ్చార్జి చేస్తామని సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో రోగులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. చివరికి భోజనాలు రావడంతో కాస్త శాంతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments