Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (07:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్‌-19 తొలిదశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లను సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కించనున్నారు. 
 
ఇందులోభాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో వేకువజామున 5.30 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 8.55 గంటలకు గుంటూరు చేరుకోనుంది. ఆ తర్వాత నరసాపూర్‌ నుంచి బయలుదేరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 11.35 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. 
 
అదేవిధంగా నడికుడి - కాచిగూడ - నడికుడి ప్యాసింజర్‌ రైలు సేవలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించారు. కొవిడ్‌ దృష్ట్యా కొన్ని స్టేషన్లలో నిలుపుదల సౌకర్యం ఎత్తివేశారు. 
 
మాచర్ల - గుంటూరు మధ్యన రెంటచింతల, గురజాల, నడికుడి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, పెదకూరపాడు, బండారుపల్లిలో మాత్రమే నిలుపుదల ఉంటుంది. మిగతా స్టేషన్లలో రైళ్లు ఆగవు. కొన్ని రైళ్లకు గుంటూరు - విజయవాడ మార్గంలో పెదకాకాని హాల్ట్‌ని తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments