Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్... పరారీలో వనిత

హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:54 IST)
హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు. దీంతో విజయ్ ఆత్మహత్య కేసులో వీరిద్దరికీ సంబంధం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. 
 
ఇటీవల సూసైడ్ చేసుకున్న విజయ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇన్నాళ్లూ తన భర్త మృతి చెందడానికి తనకూ సంబంధం లేదని చెప్పిన వనితా రెడ్డి పోలీసుల కంట పడకుండా తప్పించుకుతిరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణలో భాగంగా వనితారెడ్డి ఇంటికి వెళ్లగా, తన కూతురికి అనారోగ్యంగా ఉందని వనిత తల్లి చెప్పినట్లు తెలిసింది. 
 
అయితే వనితారెడ్డి సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమె తప్పించుకోవడానికి యత్నిస్తుందేమోనని అనుమానిస్తున్నారు. న్యాయవాది శ్రీనివాస్ కూడా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులకు ఈ అనుమానం మరింత బలపడింది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అరెస్ట్ చేయాలని విజయ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments