Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్... పరారీలో వనిత

హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:54 IST)
హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు. దీంతో విజయ్ ఆత్మహత్య కేసులో వీరిద్దరికీ సంబంధం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. 
 
ఇటీవల సూసైడ్ చేసుకున్న విజయ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇన్నాళ్లూ తన భర్త మృతి చెందడానికి తనకూ సంబంధం లేదని చెప్పిన వనితా రెడ్డి పోలీసుల కంట పడకుండా తప్పించుకుతిరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణలో భాగంగా వనితారెడ్డి ఇంటికి వెళ్లగా, తన కూతురికి అనారోగ్యంగా ఉందని వనిత తల్లి చెప్పినట్లు తెలిసింది. 
 
అయితే వనితారెడ్డి సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమె తప్పించుకోవడానికి యత్నిస్తుందేమోనని అనుమానిస్తున్నారు. న్యాయవాది శ్రీనివాస్ కూడా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులకు ఈ అనుమానం మరింత బలపడింది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అరెస్ట్ చేయాలని విజయ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments