Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ న్యాయవాదులకు బ్యాంకు ఖాతాల్లో రూ.30 వేలు జమ

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (15:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ లా నేస్తం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన యువ న్యాయవాదులకు ప్రభుత్వం సోమవారం నిధులను విడుదల చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి రూ.30 వేల చొప్పున నిధులను వారివారి బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ బటన్ నొక్కి వైఎస్ఆర్ లా నేస్తం విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున అందజేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.7.98 కోట్లను విడుదల చేస్తుంది. కొత్తగా న్యాయ కోర్సును పూర్తి చేసిన జూనియర్ న్యాయవాదులు మూడేళ్ళపాటు వృత్తిలో కొనసాగేలా యేడాదికి రూ.60 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తున్నారు. 
 
అలాగే, న్యాయవాదులు సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు రుణాలు, గ్రూపు మెడికల్ పాలసీలను ఇచ్చింది. ఇలా ఇప్పటివరకు రూ.25 కోట్ల నిధులను వైకాపా ప్రభుత్వం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments