Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ న్యాయవాదులకు బ్యాంకు ఖాతాల్లో రూ.30 వేలు జమ

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (15:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ లా నేస్తం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన యువ న్యాయవాదులకు ప్రభుత్వం సోమవారం నిధులను విడుదల చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి రూ.30 వేల చొప్పున నిధులను వారివారి బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ బటన్ నొక్కి వైఎస్ఆర్ లా నేస్తం విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున అందజేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.7.98 కోట్లను విడుదల చేస్తుంది. కొత్తగా న్యాయ కోర్సును పూర్తి చేసిన జూనియర్ న్యాయవాదులు మూడేళ్ళపాటు వృత్తిలో కొనసాగేలా యేడాదికి రూ.60 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తున్నారు. 
 
అలాగే, న్యాయవాదులు సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు రుణాలు, గ్రూపు మెడికల్ పాలసీలను ఇచ్చింది. ఇలా ఇప్పటివరకు రూ.25 కోట్ల నిధులను వైకాపా ప్రభుత్వం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments