Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (09:50 IST)
శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం వేదికగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత లబ్దిదారులను ఉద్దశించి ఆయన ప్రసంగిస్తారు. 
 
ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళంకి చేరుకుంటారు. 11 గంటల సమయంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు అమ్మఒడితో లబ్ది చేకూరుస్తూ రూ.43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6595 కోట్లను ముఖ్యమంత్రి స్వయంగా బటన్ నొక్కి జమ చేస్తారు. ఆ తర్వాత ఆయన అమ్మఒడి లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. పిమ్మట 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments