Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రోడ్ల వెంబడి ఇనుప కంచెలు

Webdunia
గురువారం, 7 జులై 2022 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గురువారం బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11 గంటలకు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు వస్తారు. ఆ తర్వాత రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. 
 
పిమ్మట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 3 గంటలకు వేంపల్లికి చేరుకుని అక్కడ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 
 
రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని, తన తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments