Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ - అమిత్ షాలతో భేటీ కోసం హస్తినకు సీఎం జగన్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాత్రి 7.30 గంటలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని వైకాపా ఎంపీలు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, వైకాపా నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వీరివద్ద సీబీఐ పలుమార్లు విచారణ జరిపింది. అయితే వైఎస్.అవినాశ్ రెడ్డి అరెస్టుకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయలేదు. లేకపోతే గత వారమే అరెస్టు చేసివుండేది. కోడికత్తి కేసులో కూడా బాధితుడైన సీఎం జగన్‌ స్వయంగా హాజరుకావాలని ఎన్.ఐ.ఏ కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments