Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమ‌ర‌ణ దీక్షా..!

కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు సీఎం రమేష్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ర‌మేష్ గ‌త కొన్ని రోజులుగా ఈ విష‌య‌మై చ‌ర్చించారు. ఆఖ‌రికి న

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (14:14 IST)
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు సీఎం రమేష్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ర‌మేష్ గ‌త కొన్ని రోజులుగా ఈ విష‌య‌మై చ‌ర్చించారు. ఆఖ‌రికి నిరాహార దీక్ష చేసేందుకు కడప జిల్లా పరిషత్‌ ఆవరణలో వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేర ఫీజు చెల్లిస్తున్నారు. 
 
ఎక్కడా సామాన్యుల‌కు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేదుంకు జిల్లా పరిషత్‌ ఆవరణను ఆమరణ దీక్షా శిబిరానికి ఎంచుకున్నట్లు సమాచారం. కాగా తొలిరోజు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులతో సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ దీక్ష‌కు అన్ని విధాల స‌హ‌క‌రించాల‌ని అధికారుల‌కు, పార్టీ నాయ‌కుల‌కు పార్టీ అధిష్టానం ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments