Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ... తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (15:02 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సీఎం క్యాంపు కార్యాలయమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ఈ సంక్రాంతి సంభరాలను ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయం తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా నిర్వహించారు. కార్యక్రమాలన సీఎం జగన్ వైఎస్ భారతిలు ఆసక్తిగా తిలకించారు. జగన్ దంపతులు గోమాతకు పూజ చేసి, ఆ తర్వాత భోగి మంటలను వెలిగించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్థాంకి వైఎస్ భారతీతో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని  వేడుకంటూ ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments