Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ... తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (15:02 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సీఎం క్యాంపు కార్యాలయమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ఈ సంక్రాంతి సంభరాలను ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయం తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా నిర్వహించారు. కార్యక్రమాలన సీఎం జగన్ వైఎస్ భారతిలు ఆసక్తిగా తిలకించారు. జగన్ దంపతులు గోమాతకు పూజ చేసి, ఆ తర్వాత భోగి మంటలను వెలిగించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్థాంకి వైఎస్ భారతీతో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని  వేడుకంటూ ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments